శ్రీ శార్వరి నామ సం।।రం।। దక్షిణాయనం; శరదృతువు; కార్తిక మాసం;శుక్ల పక్షం; విదియ: ఉ.7-00, తదియ తె.5-13 తదుపరి చవితి; జ్యేష్ఠ: సా.4-23 తదుపరి మూల; వర్జ్యం: రా.12-02 నుంచి 1-34 వరకు; అమృత ఘడియలు: ఉ.8-03 నుంచి 9-34 వరకు; దుర్ముహూర్తం: ఉ.8-23 నుంచి 9-08 వరకు; తిరిగి రా.10-28 నుంచి 11-09 వరకు; రాహుకాలం: మ.3-00 నుంచి 4-30 వరకు సూర్యోదయం: ఉ.6-09 సూర్యాస్తమయం: సా.5-21
మేషం
ప్రారంభించబోయే పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. మానసికంగా దృఢంగా ఉంటారు. సంకటహర గణపతి స్తోత్రం చదవడం మంచిది.
వృషభం
ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. అవసరానికి సహాయం చేసేవారున్నారు. శివ నామస్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
మిథునం
ప్రారంభించబోయే పనుల్లో అలసట చెందకుండా చూసుకోవాలి. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.
కర్కాటకం
శరీర సౌఖ్యం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇష్టదేవతా శ్లోకాలు చదివితే మంచిది.
సింహం
శుభకాలం. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్యమైన పనులను ప్రారంభించడానికి ఇది సరైన సమయం. మానసిక సంతృప్తిని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. లక్ష్మీదేవి దర్శనం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
కన్య
ప్రారంభించిన పనులలో ఇబ్బందులను అధిగమిస్తారు. నిర్ణీత సమయంలో లక్ష్యాలను చేరుకోవడానికి ఎక్కువగా కష్టపడాలి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆంజనేయ స్వామి దర్శనం శుభప్రదం.
తుల
మీ స్వధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. ఒక సమస్య మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది.
వృశ్చికం
ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆశించిన ఫలితాలు రావడానికి కాస్త ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు. అనవసర ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. గణపతి స్తోత్రం చదవండి. మంచి జరుగుతుంది.
ధనుస్సు
కీలక వ్యవహారాలలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. మీ కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.
మకరం
అనుకూల వాతావరణం ఉంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. ఇబ్బంది పెట్టాలని చూసే వారి ప్రయత్నాలు వృథా అవుతాయి. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. ఈశ్వర శ్లోకాలు చదవాలి.
కుంభం
శ్రమకు తగిన ఫలితాలుంటాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆదిత్య హృదయం చదవడం మంచిది.
మీనం
ప్రారంభించిన పనులను కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తి చేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. తప్పుదారి పట్టించే వారున్నారు జాగ్రత్త. సాయి నామాన్ని జపించాలి.