ఈ టీచరమ్మ పాఠాలకు పెన్సిల్, పేపర్ అవసరం లేదు!
కరోనా ప్రభావంతో ప్రస్తుతం పిల్లలందరూ ఆన్లైన్ పాఠాలు వింటున్నారు. స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్టాప్లు చేతుల్లో పట్టుకుంటూ డిజిటల్ తరగతుల బాట పడుతున్నారు. అయితే చాలామంది ఇళ్ల్లల్లో స్మార్ట్ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్లు లేకపోవడంతో చాలామంది పిల్లలు ఆన్లైన్ పాఠాలకు దూరమవుతున్న సంగతి తెలిసిందే. అయితే కశ్మీర్కు చెందిన ఓ ఉపాధ్యాయురాలు వినూత్న బోధనా పద్ధతులతో పిల్లలకు ఆసక్తి కలిగించేలా పాఠాలు చెబుతోంది. కనీసం చాక్పీస్, బ్లాక్బోర్డ్ లేకుండా విద్యార్థుల బంగారు భవిష్యత్కు బాటలు వేస్తోంది. ఈక్రమంలో ఆ టీచరమ్మ అద్భుత ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం ఈ ఏడాది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలి పురస్కారానికి ఆమెను ఎంపిక చేసింది. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 5న రాష్ర్టపతి రామ్నాథ్కోవింద్ చేతుల మీదుగా ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకోనున్నారామె. ఈ సందర్భంగా ఆ పంతులమ్మ, ఆమె వినూత్న బోధనా పద్ధతుల గురించి తెలుసుకుందాం రండి...
Know More