పాటలతో కరోనాపై పోరాటం చేస్తున్నారు!
కరోనా కారణంగా చాలామంది ఇంటి నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. కానీ ఏఎన్ఎమ్లు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ వర్కర్లు మాత్రం ఇంటింటికీ వెళ్తున్నారు. పూర్తిగా కార్యదీక్షలో మునిగిపోయి వీధి వీధి తిరుగుతూ కొవిడ్ కల్లోలంపై అందరినీ జాగృతం చేస్తున్నారు. అయిన వారే వద్దంటున్నా... అవమానాలు ఎదురైనా వృత్తిధర్మానికే ఓటేస్తున్నారు. ఇదిలా ఉంటే ఒడిశాకు చెందిన ఇద్దరు ఐసీడీఎస్ ఆరోగ్య కార్యకర్తలు కొవిడ్ వైరస్పై వినూత్న తరహాలో పోరాటం చేస్తున్నారు. వృత్తిధర్మాన్ని నిక్కచ్చిగా పాటిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో పాటు పలువురి మన్ననలు అందుకుంటున్నారు.
Know More