ఆ జ్ఞాపకాలు మళ్లీ కళ్ల ముందుకొస్తున్నాయ్!
గుంజన్ సక్సేనా.. 20 ఏళ్ల క్రితం జరిగిన భీకర కార్గిల్ యుద్ధంలో గాయాల పాలైన భారత సైనికులను తన చీతా హెలికాప్టర్లో క్షేమంగా బేస్క్యాంప్కు తరలించిన ధీర వనిత. శత్రువుల చెరకు చిక్కకుండా మెరుపు వేగంతో తన హెలికాప్టర్లో దూసుకుపోయిన ఆమె.. యుద్ధభూమిలో హెలికాప్టర్ నడిపిన తొలి మహిళా పైలట్గా అరుదైన రికార్డును తన సొంతం చేసుకుంది. తనదైన ధైర్యసాహసాలను ప్రదర్శించి కార్గిల్ గర్ల్గా మారింది. అందుకే ఆమె తెగువ, జీవిత కథను ప్రపంచానికి పరిచయం చేయాలన్న ఉద్దేశంతో రూపొందుతోందే ‘గుంజన్ సక్సేనా - ది కార్గిల్ గర్ల్’ సినిమా. శరణ్ శర్మ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో శ్రీదేవి కూతురు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గుంజన్గా కనిపించనుంది. అయితే గుంజన్ జీవితంలోని కొన్ని జ్ఞాపకాల సమాహారంతో రూపొందించిన ఓ వీడియోను నెట్ఫ్లిక్స్ ఇండియా యూట్యూబ్లో విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర పోస్టర్ను ఇన్స్టాలో పంచుకున్న గుంజన్.. ఓ సుదీర్ఘమైన పోస్ట్ రాసుకొచ్చారు. దీనికి జాన్వీ, చిత్ర దర్శకుడు శరణ్ స్పందిస్తూ పెట్టిన పోస్టులు, వీరి సోషల్ మీడియా సంభాషణ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారాయి.
Know More