అమ్మాయిలకు అండగా
అమ్మాయిలకు అన్నింటా అవకాశాలు కల్పిస్తున్నాం. గౌరవం ఇస్తున్నాం అంటూ ఎన్ని చెప్పుకున్నా..అదంతా నాణానికి ఒకవైపే అంటారు సామాజిక ఉద్యమకారిణి డా.మమతా రఘువీర్. మరోవైపు సమాజాభివృద్ధికి ప్రతిబంధకాలుగా మారిన బాల్యవివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, మహిళలపై లైంగిక వేధింపులు, గృహహింసను రూపుమాపేందుకు ఆమె తరుణి పేరుతో స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు.వరంగల్ జిల్లాలో 500 గ్రామాల్లో బాలికా సంఘాలను ఏర్పాటు చేసి వారికి ఆరోగ్యం, పోషకాహారం, బాలల రక్షణ చట్టాలు, తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. అలానే మహిళలకు వృత్తివిద్య, స్పోకెన్ ఇంగ్లిష్, జీవన నైపుణ్యాలపై శిక్షణ ఇస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 1500 బాల్యవివాహాలను అడ్డుకొని సదరు బాలికల ఉన్నతవిద్యకు సాయమందించారు. సుమారు 4వేల మంది బాలకార్మికులకు వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించారు.
Know More