ప్రకృతితో పాలపుంతను సృష్టించింది.. అవార్డు పట్టేసింది!
ఫొటోగ్రఫీ.. అమ్మాయిలు చాలా అరుదుగా కనిపించే రంగం. సరదాగానో లేదంటే హాబీ అనో కొందరు కెమెరాలు క్లిక్మనిపించినా.. వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీనే పూర్తిస్థాయి కెరీర్గా మలచుకున్న అమ్మాయిలు మాత్రం చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. అలాంటి అరుదైన అమ్మాయిల జాబితాలోకి వస్తుంది 23 ఏళ్ల ఐశ్వర్యా శ్రీధర్. చిన్నప్పుడు తండ్రితో కలిసి అడవికి వెళ్లి సరదాగా ఫొటోలు తీసిన ఆమె.. తన ఆసక్తికి కాస్త సృజనాత్మకతను జోడించింది. వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీనే కెరీర్గా మలచుకుని 12 ఏళ్ల నుంచే ప్రకృతి అందాలను ఫొటో ఫ్రేముల్లో బంధించడం మొదలుపెట్టింది. తన ఫొటోగ్రఫీ ప్రతిభకు తార్కాణంగా ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్న ఈ టీనేజ్ సెన్సేషన్ తాజాగా ప్రతిష్ఠాత్మక ‘వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. తద్వారా ఈ పురస్కారాన్ని గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది.
Know More