వైద్యులు ఆపదలో ఉన్నా శస్త్రచికిత్సకు పూనుకున్నారు..!
వేలల్లో ప్రసవాలు చేసిన చేతులు.. పెద్ద ప్రాణానికి ఏ ముప్పూ రాకుండా కాపాడిన చేతులు.. అడ్డం తిరిగిన బిడ్డనూ అడ్డంకులు అధిగమించి ఈ లోకంలోకి తెచ్చిన చేతులు.. ఈసారి తల్లీబిడ్డలే కాదు.. ఆ వైద్యులూ ఆపదలో ఉన్నారు. ప్రాణాలను ఫణంగా పెట్టి శస్త్రచికిత్సకు పూనుకున్నారు. గంటలోపు గండాన్ని దాటి.. శిశువుకు స్వాగతం పలికారు. కొవిడ్ బాధితురాలికి పురుడు పోసి వైద్యుల గొప్పదనాన్ని మరోసారి చాటారు. కరోనా బారినపడిన ఇద్దరు గర్భిణులకు అమ్మదనం ప్రసాదించారు. వారే గాంధీ ఆస్పత్రికి చెందిన వైద్యబృందం. దానికి నేతృత్వం వహించారు గాంధీ ఆస్పత్రి గైనకాలజీ హెచ్ఓడీ, ప్రముఖ వైద్యనిపుణురాలు డాక్టర్ మహాలక్ష్మి. ఈ సందర్భంగా వసుంధర ఆమెను పలకరించింది.
Know More