అదో భయంకరమైన అనుభవం.. కరోనాను జోక్గా తీసుకోవద్దు!
కరోనా కారణంగా ఒంటరితనం అంటే ఎలా ఉంటుందో చాలామందికి తెలిసొచ్చింది. వైరస్ సోకి స్వీయ నిర్బంధంలో ఉంటూ కొందరు; ఆస్పత్రులు, క్వారంటైన్ సెంటర్లలో చికిత్స పొందుతూ మరికొందరు... ఇలా ఎక్కడి వారక్కడే ఏకాకిగా మిగిలిపోతున్నారు. ఫలితంగా ఒంటరితనంతో తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. అలాంటి గడ్డు పరిస్థితుల్ని తానూ ఎదుర్కొన్నానంటోంది హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా. పదేళ్ల క్రితం పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్తో కలిసి పెళ్లిపీటలెక్కిన ఈ టెన్నిస్ క్వీన్ రెండేళ్ల క్రితం ఇజాన్కు జన్మనిచ్చింది. అమ్మయ్యాక అటు కుటుంబ బాధ్యతల్ని నెరవేరుస్తూనే... ఇటు తన కెరీర్నూ కొనసాగిస్తోందీ సూపర్ మామ్. ఈక్రమంలో తన కుమారుడి ఆలనాపాలనలో అమ్మతనాన్ని పూర్తిగా ఆస్వాదిస్తోన్న సానియా కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిందట. ఈ కారణంగా కొద్ది రోజుల పాటు తన కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చిందంటూ తన అనుభవాలను ఇన్స్టాగ్రామ్ ద్వారా అందరితో షేర్ చేసుకుందీ టెన్నిస్ బ్యూటీ. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది.
Know More