నిబంధనలు పాటిస్తూనే అలా సింపుల్గా పెళ్లి చేసుకున్నాం !
పెళ్లంటే.. వధూవరులు, ఇరు కుటుంబ సభ్యులు, అతిథులు, అక్షతలు.. ఇలా జీవితంలో ఒకేసారి చేసుకునే ఈ వేడుకను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవాలనుకుంటారు ప్రతి ఒక్కరూ. అయితే ఈ కరోనా కాలంలో పెళ్లి చేసుకునే వారికి అంత అదృష్టం కరువైందని చెప్పుకోవాలి. లాక్డౌన్, సామాజిక దూరం పేరుతో చాలా పెళ్లిళ్లు తూతూ మంత్రంగానే జరిగిపోతున్నాయి. వధువు ఒక చోట, వరుడు మరో చోట ఉంటే ఫోన్కే తాళికట్టి పెళ్లైందనిపించే రోజులొచ్చాయి. అంతేనా.. వధూవరులిద్దరూ ఒకే చోట ఉండి, కుటుంబ సభ్యులు వేరే ప్రాంతాల్లో ఉంటే వీడియో కాలింగ్ యాప్స్ ద్వారా అందరినీ ఒక్కచోట చేర్చి మరీ అక్షతలు వేయించుకుంటున్నాయి కొత్త జంటలు. ఇదిగో.. తమ పెళ్లీ ఇలాగే జరిగిందంటోంది ఓ నవ వధువు. ఉద్యోగ రీత్యా వేరే ప్రాంతంలో ఉన్న తమకు ముందుగానే పెళ్లి ముహూర్తం నిశ్చయమైనప్పటికీ.. కరోనా కారణంగా స్వస్థలాలకు వెళ్లలేక ఉన్నచోటే పెళ్లి చేసుకున్నామంటూ తమ పెళ్లి ముచ్చట్లను మనతో పంచుకోవడానికి ఇలా మన ముందుకొచ్చేసింది.
Know More