ఆ మధ్యాహ్నం నేనెప్పటికీ మర్చిపోలేను !
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుటుంబ సమేతంగా ఇటీవలే భారత పర్యటనకు వచ్చి వెళ్లిన విషయం తెలిసిందే. వీళ్లు దిల్లీలో పర్యటించిన ఆ రెండురోజులూ అక్కడే కాదు.. దేశమంతా సందడి నెలకొంది. అయితే ఈ పర్యటనలో భాగంగా రెండో రోజు ట్రంప్ సతీమణి, అమెరికా ప్రథమ మహిళ.. మెలానియా ట్రంప్ దిల్లీ మోతీబాగ్లోని సర్వోదయ పాఠశాలను సందర్శించారు. అక్కడి విద్యార్థులు ఆమెను సంప్రదాయబద్ధంగా, ఎంతో ఆత్మీయంగా స్వాగతించారు. ఆపై అక్కడి విద్యార్థులు చేసిన నృత్యాలు, పాఠశాలలో నిర్వహించే ‘హ్యాపీనెస్ కరిక్యులం’ క్లాసులు ఆమెను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో భారత పర్యటన తనకెన్నో మధురానుభూతుల్ని మిగిల్చిందని, ముఖ్యంగా సర్వోదయ పాఠశాలలోని విద్యార్థులు, అక్కడి హ్యాపీనెస్ తరగతులు తనలో ఎంతగానో స్ఫూర్తి నింపాయని అమెరికాకు వెళ్లాక ట్వీట్ల మీద ట్వీట్లు చేశారు మెలానియా. అంతేకాదు.. ఈ క్రమంలో ఆమె ఆనందాన్ని ఇలా పంచుకున్నారు.
Know More