నిన్ను నమ్మించి గొంతు కోశారు... మమ్మల్ని క్షమించు!
ఆకలి తీర్చుకోవడానికి అడవి నుంచి జనావాసంలోకి వచ్చిన ఆ ఏనుగు ఇక్కడ కూడా కొన్ని మానవ మృగాలుంటాయని కనిపెట్టలేకపోయింది. అందుకే అనాస పండు(పైనాపిల్)లో ప్రాణం తీసే పేలుడు పదార్థాలు పెట్టిచ్చినా ఆబగా నోటికందుకుంది. ఆ అనాస తన ఆయుష్షు తీస్తుందని తెలియక అమాయకంగా నోరు, నాలుక, దవడను పూర్తిగా ఛిద్రం చేసుకుంది. ఎంతటి బాధనైనా తట్టుకోగలిగే ఆ భారీకాయం ఆ పేలుడు నొప్పి, మంటకు మాత్రం పసిపాపలా విలవిల్లాడిపోయింది. ఉపశమనం కోసం చల్లటి నీరు దొరికితే బాగుండునని ఊరూరా తిరిగింది. చివరకు ఓ నదిలోకి దిగి వూపిరి పీల్చుకుంది. కానీ అప్పటికే నోరంతా ఛిద్రం అవ్వడం, ఏమీ తినకపోవడంతో ఆకలితోనే ప్రాణమొదిలింది. భూతల స్వర్గంగా పేరొందిన కేరళలో జరిగిన ఈ ఘోరం ‘మనుషుల్లో మానవత్వం మాయమవుతోంది’ అన్న మాటకు సజీవ సాక్ష్యంలా నిలుస్తోంది. ఇక్కడ చింతించాల్సిన మరో విషయం ఏమిటంటే మానవ మృగాల చేతిలో మృత్యువాత పడిన ఆ మూగజీవం గర్భంతో ఉండడం..!
Know More